కరోనా క్రిమిసంహార హోమం
ABN , First Publish Date - 2021-04-19T06:24:53+05:30 IST
కరోనా క్రిమిసంహార హోమం
వరంగల్ టౌన్, ఏప్రిల్ 18: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లోని శ్రీ లక్ష్మీగణపతి సహిత అభయాంజనేయస్వామి దేవాలయంలో ఆదివారం వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కరోనా క్రిమిసంహార హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి మాట్లాడుతూ.. క్రిమిసంహార హోమం ఆదివారం నుంచి శనివారం వరకు జరుగుతుందన్నారు. ఉమ్మడి వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక, రైతు, కార్మిక, కర్షక, మార్కెట్ వర్గాల శ్రేయస్సు దృష్ట్యా హోమం చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గౌరవ కార్యదర్శి తోట నర్సింహరావు, కొత్త కిషోర్కుమార్, శ్రీరాం భిక్షపతి, పోతు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.