తన సోదరిని తీసుకెళ్లిన స్నేహితుడిపై యువకుడి ఆగ్రహం.. కలుద్దామని పిలిచి ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

ABN , First Publish Date - 2022-01-10T22:19:09+05:30 IST

మనీష్, వికాస్ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు.. ఆ క్రమంలో వికాస్ సోదరితో మనీష్ ప్రేమలో పడ్డాడు..

తన సోదరిని తీసుకెళ్లిన స్నేహితుడిపై యువకుడి ఆగ్రహం.. కలుద్దామని పిలిచి ఎంత ఘోరానికి పాల్పడ్డాడంటే..

మనీష్, వికాస్ చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు.. ఆ క్రమంలో వికాస్ సోదరితో మనీష్ ప్రేమలో పడ్డాడు.. ఆమె కూడా మనీష్‌ను ప్రేమించింది.. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకున్నారు.. అందుకు వికాస్, అతని కుటుంబ సభ్యులు అంగీకరించలేదు..దీంతో ఇద్దరూ ఇళ్ల నుంచి వేరే ఊరు వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు.. అక్కడే కాపురం పెట్టారు.. ఇటీవల మనీష్‌తో మాట్లాడిన వికాస్ అతడిని తిరిగి ఊరికి రప్పించాడు.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితులతో కలిసి చంపేశాడు. 


రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలో ఉన్న చురు గ్రామానికి చెందిన మనీష్, వికాస్ మంచి స్నేహితులు. కలిసి తిరిగేవారు. ఈ క్రమంలో వికాస్ సోదరి పూజతో మనీష్ ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అందుకు పూజ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో గతేడాది ఫిబ్రవరిలో పూజ, మనీష్ ఊరు నుంచి ఢిల్లీ వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. మనీష్ తనకు ద్రోహం చేశాడని వికాస్ పగ పెంచుకున్నాడు. స్నేహితుడికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకున్నాడు. తను మారిపోయినట్టు నటించి మనీష్‌తో మాటలు కలిపాడు.


నూతన సంవత్సరం సందర్భంగా ఊరికి ఆహ్వానించాడు. దీంతో మనీష్ ఈ నెల 1వ తేదీన గ్రామానికి వెళ్లాడు. వికాస్ మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మనీష్‌ను శనివారం రాత్రి పార్టీ పేరుతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మనీష్‌పై దాడి చేశాడు. తనతో పాటు తెచ్చుకున్న కత్తి తీసుకుని మనీష్ గొంతు కోసేశాడు. దీంతో మనీష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం స్నేహితులతో కలిసి వికాస్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు మనీష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు. వికాస్, అతడి స్నేహితుల కోసం గాలిస్తున్నారు.    

Updated Date - 2022-01-10T22:19:09+05:30 IST