హోరాహోరీగా రాష్ట్ర స్థాయి హాకీ టోర్నీ
ABN , First Publish Date - 2022-01-25T06:42:28+05:30 IST
పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడామైదానంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి జూనియర్ మెన్ హాకీ పోటీల్లో సోమవారం హోరాహోరీగా జట్లు తలపడ్డాయి.
ఎలమంచిలి, జనవరి 24: పట్టణంలోని రాజీవ్ గాంధీ క్రీడామైదానంలో జరుగుతున్న 12వ రాష్ట్రస్థాయి జూనియర్ మెన్ హాకీ పోటీల్లో సోమవారం హోరాహోరీగా జట్లు తలపడ్డాయి. తొలుత ఈ పోటీలను డాక్టర్ మెహతా, ఎలమంచిలి హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రెడ్డి ప్రారంభించారు. చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల జట్ల మధ్య పోరు ఉత్కంఠగా సాగింది. 13 జిల్లాల నుంచి జట్లు పాల్గొన్నాయి. నాకౌట్ దశలో జట్లు గెలుపొందిన పాయింట్ల ఆధారంగా టోర్నమెంటు చివరి రోజు లీగ్ మ్యాచ్ జరగనుంది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ పోటీలను తిలకించేందుకు పెద్ద సం ఖ్యలో క్రీడాభిమానులు, క్రీడాకారులు విచ్చేస్తున్నారు. సీనియర్ క్రీడాకారులు దాసరి మహేష్, రాంబాబు, సాయి నిర్వాహకులకు ప్రోత్సాహం అందిస్తున్నారు.