రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు గుర్ల క్రీడాకారులు
ABN , First Publish Date - 2021-02-25T04:56:15+05:30 IST
రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు గుర్ల క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ కర్రోతు జగదీష్ తెలిపారు.
గుర్ల: రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు గుర్ల క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్ కర్రోతు జగదీష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రేణిగుం టలో మార్చి 12, 13 తేదీల్లో జరగనున్న సబ్ జూనియర్ బాల బాలికలు రెజ్లింగ్ చాంపి యన్షిప్కు వారు అర్హత సాధించినట్లు చెప్పారు. వి.లావణ్య, పట్నాయక్, టి.చంద్రశేఖర్, మంత్రి శ్రీను, కె.సాయి, ఐ.వెంకటేష్, పి.నారాయణరావు, ఎం. మురళి, ఆదిలక్ష్మి, కృష్ణవేణి, మనిషా, నిఖిత కుమారి పోటీల్లో పాల్గొనున్నట్లు వెల్లడించారు. వారి ఎంపికపై రెజ్లింగ్ అసోసియేషన్ చైర్మన్ వి.వెంకటరమణ, ఆర్కే పురుషోత్తమరావు హర్షం వ్యక్తం చేశారు.