ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
ABN , First Publish Date - 2020-10-30T04:29:36+05:30 IST
వరద ముంపులో నివాసాలను గుర్తించి బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైసీపీ నాయకులు ఇందుకూరి నారాయణరాజు అన్నారు.
సిద్దాపురం (ఆకివీడు రూరల్) : వరద ముంపులో నివాసాలను గుర్తించి బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని వైసీపీ నాయకులు ఇందుకూరి నారాయణరాజు అన్నారు. సిద్ధాపురంలో నీట మునిగిన ఇళ్లను వారు పరిశీ లించారు. తొండకోడు, క్రిస్టియన్ పేట, కురుపాక ప్రాంతాలలో వీఆర్వో ఆంజ నేయులతో కలిసి పర్యటించారు. ప్రభుత్వం సాయమందిస్తుందని తెలిపారు. భూపతిరాజు అంజిరాజు, తోట శివాజీ, కిల్లి రామకృష్ణ, భూపతిరాజు బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు.