ఇంటి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేయాలి

ABN , First Publish Date - 2021-06-24T05:22:54+05:30 IST

వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ఇంటి నివేశన పట్టాలు కలిగిన లబ్ధిదారులందరితో ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు కృషి చేయాలని ఎంపీడీఓ ఎం రంగసుబ్బరాయుడు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలో 8 లేఅవుట్లు వేశామని, వాటిలో 1319 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసి కాలనీలు మంజూరు చేశామన్నారు.

ఇంటి నిర్మాణాలు చేపట్టేలా కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీఓ రంగసుబ్బరాయుడు

పామూరు, జూన్‌23: వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ఇంటి నివేశన పట్టాలు కలిగిన లబ్ధిదారులందరితో ఇంటి నిర్మాణ పనులు చేపట్టేలా అధికారులు కృషి చేయాలని ఎంపీడీఓ ఎం రంగసుబ్బరాయుడు సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. మండలంలోని 7 గ్రామ పంచాయతీల పరిధిలో 8 లేఅవుట్లు వేశామని, వాటిలో 1319 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేసి కాలనీలు మంజూరు చేశామన్నారు. ఒక్కో గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 1. 50 లక్షలు ఇస్తుందని. లే అవుట్లలో మౌలిక వసతుల కోసం బోర్లు, విద్యుత్‌ సౌకర్యం, రోడ్ల నిర్మాణం వంటి పనులు పూర్తయ్యాయని, లబ్ధిదారులందరికీ అవగాహన కల్పించి ఇళ్లు కట్టుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో ఈఓపీఆర్‌డీ వి. బ్రహ్మానందరెడ్డి, హౌసింగ్‌ ఏఈ వర్మతో పాటు వీఆర్‌ఓలు, గ్రామ సచివాలయ కార్యదర్శులు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.  స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇంటి నిర్మాణ పనులపై వలంటీర్లతో సమావేశం నిర్వహించారు. 


Updated Date - 2021-06-24T05:22:54+05:30 IST