విజయవాడ: హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళన
ABN , First Publish Date - 2021-03-02T22:56:36+05:30 IST
విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బి భవనాల్లో హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళనకు దిగారు.
విజయవాడ: నగరంలోని ఆర్ అండ్ బి భవనాల్లో పనిచేసే హౌస్ కీపింగ్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. నాలుగు నెలలుగా వేతనాలు చెల్లిండంలేదని నిరసన చేపట్టారు. హౌస్ కీపింగ్ వర్కర్స్ పనులు మానేయడంతో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలోనూ పారిశుద్ధ్య పనులు నిలిచిపోయాయి. జీతాలు అడిగితే ప్రభుత్వం బిల్లులు ఇవ్వలేదని కాంట్రాక్ట్ యజమాన్యం చెబుతోందని, తాము ఎవరిని అడగాలని ప్రశ్నించారు. తమ సమస్యను సీఎం జగన్ అర్ధం చేసుకుని జీతాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ ఇస్తామన్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని, నాలుగేళ్లుగా జీతాలు కూడా పెంచలేదని వర్కర్స్ వాపోయారు.