గృహణం వీడేనా?

ABN , First Publish Date - 2022-01-18T05:24:23+05:30 IST

డబుల్‌ పథకం మండలంలో అభాసుపాలవుతోంది. డబుల్‌ పథకం రెండో విడతలో భాగంగా నామారం, అన్నపురెడ్డిపల్లి, కొండాయిగూడెం, వెంకటాపురంలో రూ. కోట్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.

గృహణం వీడేనా?
డబుల్‌ ఇళ్ల చుట్టూ పెరిగిన పిచ్చి మొక్కలు

బిల్లులు రాక కాంట్రాక్టర్‌ ఘొల్లు

మధ్యలోనే నిలిచిన డబుల్‌ ఇళ్లు

పిచ్చి మొక్కలతో అధ్వానంగా గృహ సముదాయాలు

ఆశగా ఎదురుచూస్తున్న పేదలు

ప్రభుత్వానికి నివేదిక పంపించాం: ఐటీడీఏ ఏఈ

అన్నపురెడ్డిపల్లి, జనవరి 17: డబుల్‌ పథకం మండలంలో అభాసుపాలవుతోంది. డబుల్‌ పథకం రెండో విడతలో భాగంగా నామారం, అన్నపురెడ్డిపల్లి, కొండాయిగూడెం, వెంకటాపురంలో రూ. కోట్ల ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. కాంట్రాక్టర్‌కు బిల్లులు సకమంగా రాకపోవడంతో పనులను మధ్యలోనే వదిలేశారు. ఇళ్లు పూర్తికాకపోవడంతో అందులో పిచ్చి మొక్కలు మొలిచాయి. సంబందిత శాఖాధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నా ఇళ్లు పూర్తికావడం లేదు. ఏడాది కావొస్తున్నా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ సంబంధిత కార్యా లయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ విషయమై ఐటీడీఏ ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా బిల్లులు ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇప్పటికే పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరు వరకు కాంట్రాక్టర్‌ పనులు పునఃప్రారంభిస్తారన్నారు.


Updated Date - 2022-01-18T05:24:23+05:30 IST