ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి
ABN , First Publish Date - 2021-09-29T06:36:09+05:30 IST
జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగవంగా పూర్తి కావాలని సబ్ కలెక్టర్ సూర్యసాయిప్రవీణ్చంద్ అధికారులను ఆదేశించారు.
సబ్ కలెక్టర్ ప్రవీణ్చంద్
మైలవరం, సెప్టెంబరు 28 : జగనన్న కాలనీల్లో ఇంటి నిర్మాణాలు వేగవంగా పూర్తి కావాలని సబ్ కలెక్టర్ సూర్యసాయిప్రవీణ్చంద్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి తగు సూచనలు చేశారు. మండలంలో 2400లకు పైగా ఇళ్లు నిర్మించడానికి అనుమతులు వచ్చాయని, అదనంగా మరికొన్ని ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఇసుక, సిమెంట్, ఇనుము ఇవ్వడం జరుగుతుందన్నారు. జగనన్న కాలనీల్లో అన్ని సదుపాయాలు కల్పించి త్వరితగతిన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేలా చూడాలన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ను సందర్శించి పోలీసుల పనితీరును అడిగి తెలసుకున్నారు. ముందుగా పుల్లూరు గ్రామం సీతారామపురం తండాలో పర్యటించి ఆర్వోఎ్ఫఆర్వో భూములను పరిశీలించారు. మొర్సుమల్లి గ్రామ సచివాలయాన్ని, ఆరోగ్య కేంద్రాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని సూచించారు. అయ్యప్ప నగర్ పట్టాలు రెండు వారాల్లో లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. తహసీల్దార్ రోహిణీదేవి, ఎంపీడీవో సుబ్బారావు, హౌసింగ్ డీఈ, ఆర్డబ్ల్యూఎస్ డీఈ భాస్కర్రెడ్డి, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.