ఇస్నాపూర్‌లో గృహిణి అదృశ్యం

ABN , First Publish Date - 2021-04-19T05:48:59+05:30 IST

కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఇస్నాపూర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది.

ఇస్నాపూర్‌లో గృహిణి అదృశ్యం

పటాన్‌చెరు, ఏప్రిల్‌ 18: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది ఇంట్లోంచి వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఇస్నాపూర్‌లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పటాన్‌చెరు ఎస్‌ఐ సాయిలు తెలిపిన వివరాల ప్రకారం... ఇస్నాపూర్‌లో నివాసం ఉండే రాము, చాకలి గీత (30) ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి సంతానం కలగలేదు. ఇటీవల భార్యా, భర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. కాగా శనివారం మఽధ్యాహ్నం ఇంట్లోంచి వెళి ్లన గీత తిరిగి రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్ఛాప్‌ రావడంతో ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద వెతికారు. గృహిణి జాడ తెలియకపోవడంతో ఆదివారం పటాన్‌చెరు పోలీ్‌సస్టేషన్‌లో భర్త రాము ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-04-19T05:48:59+05:30 IST