మద్యం అమ్మకాలపై హెచ్ఆర్సీకి ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-27T10:53:41+05:30 IST
లాక్డౌన్ సడలింపులో భాగంగా ప్రభుత్వ అనుమతిమేరకు కొనసాగుతున్న మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు
మిర్యాలగూడ అర్బన్, మే 26: లాక్డౌన్ సడలింపులో భాగంగా ప్రభుత్వ అనుమతిమేరకు కొనసాగుతున్న మద్యం అమ్మకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మానవహక్కుల కమిషన్కు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాజుల లింగయ్యగౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానికంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలు జరపడంతో సామాన్య, మధ్యతరగతి, దినసరి కార్మికుల రోజువారీ సంపాదనంతా మద్యం కొనుగోళ్లకు ఖర్చు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని కోరుతూ ఫిర్యాదు చేశామన్నారు.