‘‘జూనియర్ డాక్టర్ల విరాళాల’’పై హెచ్ఆర్సీ నోటీసులు
ABN , First Publish Date - 2020-04-09T09:29:21+05:30 IST
కరోనా రక్షణ పరికరాలు కావాలి. విరాళాలు ఇవ్వండి’ అని జూనియర్ డాక్టర్లు వేడుకోవడంపై హెచ్ఆర్సీ స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో నివేదికను
16లోగా నివేదిక ఇవ్వాలని వైద్య శాఖకు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ‘కరోనా రక్షణ పరికరాలు కావాలి. విరాళాలు ఇవ్వండి’ అని జూనియర్ డాక్టర్లు వేడుకోవడంపై హెచ్ఆర్సీ స్పందించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో నివేదికను 16లోగా సమర్పించాలని ఆదేశించింది. తమకు రక్షణ పరికరాలు అందించడం లేదంటూ జూనియర్ డాక్టర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేయడంపై హైదరాబాద్కు చెందిన న్యాయవాది తులసిరాజ్ గోకుల్ బుధవారం హెచ్ఆర్సీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ‘విరాళాలు ప్లీజ్’ శీర్షికతో బుధవారం ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనాన్ని ఫిర్యాదుకు జతచేశారు. దీన్ని పరిశీలించిన హెచ్ఆర్సీ.. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి బుధవారం నోటీసులు జారీ చేసింది.