గుజరాత్ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-06-04T08:34:30+05:30 IST
గుజరాత్లోని ఓ కర్మాగారంలో బాయిలర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. 82 మంది గాయపడ్డారు. భరూచ్ జిల్లాలోని దహేజ్లో ఉన్న యశస్వి రసాయన్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది...
- 8 మంది మృతి, 82 మందికి గాయాలు
భరూచ్, జూన్ 3: గుజరాత్లోని ఓ కర్మాగారంలో బాయిలర్ పేలి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు చనిపోయారు. 82 మంది గాయపడ్డారు. భరూచ్ జిల్లాలోని దహేజ్లో ఉన్న యశస్వి రసాయన్ అనే కర్మాగారంలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో కర్మాగారంలో 230 మంది కార్మికులు ఉన్నారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. కర్మాగారానికి చుట్టుపక్కల ఇతర రసాయన కంపెనీలు ఉండడంతో లువారా, లఖిగామ్ గ్రామాల నుంచి 4,800 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.