సామాన్యుడి బడ్జెట్ తలకిందులు.. ఇవి మరింత ప్రియం
ABN , First Publish Date - 2021-11-26T09:17:44+05:30 IST
సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల రేట్ల పెంపు కొనసాగుతోంది. తాజాగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్),
- రేట్లు పెంచిన హెచ్యూఎల్, ఐటీసీ
- సబ్బులు, డిటర్జెంట్లు మరింత ప్రియం
న్యూఢిల్లీ : సామాన్యుడి బడ్జెట్ తలకిందులవుతోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీల రేట్ల పెంపు కొనసాగుతోంది. తాజాగా హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్యూఎల్), ఐటీసీ.. తమ సబ్బు లు, డిటర్జెంట్ల ధరలు పెంచేశాయి. హెచ్యూఎల్ 100 గ్రాముల లక్స్ సబ్బుల మల్టీప్యాక్ ధర ను ఏకంగా 21.5 శాతం (రూ.25) పెంచేసింది. కిలో వీల్ డిటర్జెంట్ పౌడర్ ధర 3.4 శాతం (రూ.2), 250 గ్రాముల రిన్ బార్ ధర 5.8 శాతం పెంచింది. ఐటీసీ కూడా తన 100 గ్రాముల ఫియామా, వివెల్ సబ్బుల ధరలను పది శాతం పెంచినట్టు మార్కెట్ వర్గాలు చెప్పాయి. ఎంగేజ్ పెర్ఫ్యూమ్, డియోడరెంట్ ధరలను 7.1 శాతం నుంచి 7.6 శాతం వరకు పెంచినట్టు తెలుస్తోంది. ముడి పదార్ధాలతో సహా అన్ని ఖర్చులు పెరిగినందున ధరలు పెంచక తప్పడంలేదని రెండు కంపెనీలు తెలిపాయి.