మానవత్వం చాటుకున్న డ్రైవర్లు
ABN , First Publish Date - 2021-06-21T04:16:07+05:30 IST
బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, మంచిర్యాలకు చెందిన లారీ డ్రైవర్లు, పలువురు యాజమానులు ఆదివారం మానవత్వం చాటుకున్నారు.
కాగజ్నగర్, జూన్ 20: బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, మంచిర్యాలకు చెందిన లారీ డ్రైవర్లు, పలువురు యాజమానులు ఆదివారం మానవత్వం చాటుకున్నారు. కాగజ్నగర్ పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ మహ్మద్రఫీక్(36) బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, మంచిర్యాలలో పనిచేసే వాడు. కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందాడు. తమవం తుగా రఫీక్ కుటుంబాన్ని ఆదుకునేందుకు డ్రైవర్లు తలాకొంత చందాలు వేసుకున్నారు. అలాగే ఓనర్లు కూడా తమ వంతుగా సహాయం చేసి రూ.70,253 అందజేశారు. ఒక నెలకు సరిపడా నిత్యావసర సరు కులు అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వనమాల విజయ ఈ కార్యక్ర మాన్ని చేపట్టిన అందరినీ అభినందించారు. నాయకులు మహేష్ గౌడ్, శ్రీను, మోహన్, రాజు, తాజు, సంతోష్, రఘ, రాజేష్, నయిం, వెంకటేష్, వంశీ పాల్గొన్నారు.