ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యుల మానవత్వం

ABN , First Publish Date - 2021-05-11T05:47:15+05:30 IST

పట్టణంలోని ఆపద్భాందవ ట్రస్ట్‌ సభ్యులు ఓ యాచకుడి మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు.

ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యుల మానవత్వం
మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తీసుకెళ్తున్న ట్రస్ట్‌ సభ్యులు

యాచకుడి మృతదేహానికి అంత్యక్రియలు 


ఉరవకొండ, మే 10: పట్టణంలోని ఆపద్భాందవ ట్రస్ట్‌ సభ్యులు ఓ యాచకుడి మృతదేహానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. టవర్‌క్లాక్‌ కూడలిలో యాచకుడు క్రిష్టప్ప (70)   మృతి చెందాడు. మృతదేహాన్ని అందరూ చూస్తున్నారే గాని అంత్యక్రియల కు తరలించడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఎస్‌ఐ రమే్‌షరెడ్డి ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యులకు సమాచారమిచ్చారు.

             

     స్పందించిన ట్రస్ట్‌  సభ్యులు వెంటనే టవర్‌క్లాక్‌ వద్దకు చేరుకుని కరోనా నిబంధనలు పాటిస్తూ క్రిష్టప్ప మృతదేహానికి గుంతకల్లు రోడ్డులోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. కా ర్యక్రమంలో ఆపద్బాంధవ ట్రస్ట్‌ సభ్యులు మురళి, నూర్‌బాషా, పవన, నవీన, భీమా, వేణుమాధవ్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:47:15+05:30 IST