శతాధిక వృద్ధురాలు మృతి

ABN , First Publish Date - 2021-12-09T07:11:34+05:30 IST

నేరేడుచర్ల మండలానికి చెందిన రేగళ్ల సీతమ్మ(103) బుధవారం సాయంత్రం మృతి చెందారు.

శతాధిక వృద్ధురాలు మృతి
సీతమ్మ (ఫైల్‌ ఫొటో)

నేరేడుచర్ల, డిసెంబరు 8: నేరేడుచర్ల మండలానికి చెందిన రేగళ్ల సీతమ్మ(103) బుధవారం సాయంత్రం మృతి చెందారు. ఆమె మృతదేహానికి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధూళిపాల ధనుంజయనాయుడు  నివా ళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వామపక్ష ఉద్యమంలో చివరి మజిలీ వరకు సీతమ్మ పోరాడారని కొనియాడారు. ఆమె ఖర్చుల నిమిత్తం నేరేడుచర్ల మాజీ సర్పంచ్‌ కొణతం సత్యనారాయణరెడ్డి నెలకు రూ.500 నాలుగేళ్లుగా ఇస్తున్నారు.  సీతమ్మ మృతికి సత్యనారాయ ణరెడ్డి సంతాపం తెలిపారు.  ఆమే మృతికి సంతాపం తెలిపారు.



నాయకులు 

Updated Date - 2021-12-09T07:11:34+05:30 IST