మహిళపై భార్యాభర్తల దాడి
ABN , First Publish Date - 2022-01-24T05:47:41+05:30 IST
బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను భార్యాభర్తలు దాడి చేసి కొట్టారని బేతంచెర్ల ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు.
బేతంచెర్ల, జనవరి 23: బేతంచెర్ల మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళను భార్యాభర్తలు దాడి చేసి కొట్టారని బేతంచెర్ల ఎస్ఐ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. రంగాపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవిని అదే గ్రామానికి చెందిన భార్యాభర్తలు మద్దిలేటి, లక్ష్మీదేవి పాత కక్షలు మనసులో పెట్టుకుని దుర్భాషలాడి కాళ్లతో చేతులతో కర్రలతో కొట్టి గాయపరిచారని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భార్యాభర్తలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.