భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-06-21T04:32:25+05:30 IST
భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చినవంకలో చోటు చేసుకుంది.
వజ్రపుకొత్తూరు: భార్య మందలించిందని భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చినవంకలో చోటు చేసుకుంది. ఎస్ఐ కూన గోవిందరావు కథనం మేరకు... మండలంలోని చినవంకకు చెందిన మల్లా కామేశ్వ రరావు (50) రెండేళ్లుగా మద్యానికి బానిసై గ్రామంలో అప్పుచేస్తూ కుటుంబ బాధ్యతలు పట్టించుకోవడం లేదు. దీంతో శనివారం రాత్రి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై మద్యం సేవించి ఇంటికి రావ డంతో భార్య రూపావతి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన కామేశ్వరరావు ఇంటి వరండాలో ఉన్న ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీఆర్వో వసంతరావు ద్వారా ఆదివారం ఉదయం సమాచారం అందుకున్న ఎస్ఐ గోవిందరావు సంఘటన స్థలా నికి చేరుకొని మతదేహాన్ని పరిశీలించారు. తొలుత అనుమానిత మృతిగా
భావించి క్రైంబ్రాంచ్ పోలీసులతో మృతదేహాన్ని, ఇంటి పరిసరాలను పరిశీలించారు. అనుమానిత లక్షణాలు కనిపించకపోవడంతో ఆత్మహత్యగా పోలీ సులు నిర్ధారణకు వచ్చారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు. కామేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఆయన ఆత్మహ త్యకు పాల్పడడంతో గ్రామంలో విషాదచాయలు అలు ముకున్నాయి. కామేశ్వర రావు కుటుంబానికి ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.