భార్య పుట్టింటికి రాలేదని భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-06-18T05:05:52+05:30 IST

పుట్టింటికి వెళ్లిన భార్య పిలిచినా ఇంటికి రానందుకు మనస్తాపం చెందిన మెటికల నాగచంద్రుడు (38) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామేశ్వరం బైపా్‌సలో తోటలో గురువారం వెలుగు చూసింది.

భార్య పుట్టింటికి రాలేదని భర్త ఆత్మహత్య
మృతి చెందిన నాగచంద్రుడు

ప్రొద్దుటూరు క్రైం, జూన్‌ 17 : పుట్టింటికి వెళ్లిన భార్య పిలిచినా ఇంటికి రానందుకు మనస్తాపం చెందిన మెటికల నాగచంద్రుడు (38) చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రామేశ్వరం బైపా్‌సలో తోటలో గురువారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల మేరకు.. రామేశ్వరం బిట్టలయ్యస్వామి ఆలయం సమీపంలో నివాసముంటున్న నాగచంద్రుడు, స్థానికంగా బట్టల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. ఇతనికి 12 ఏళ్ల క్రితం ఈశ్వర్‌రెడ్డినగర్‌కు చెందిన ఆదిలక్ష్మితో వివాహమైంది. ఇదిలా ఉండగా, నాగచంద్రుడు మద్యానికి బానిసై తాగొ చ్చి, రోజూ భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో నెల క్రితం భార్య పుట్టింటికి చేరింది. అయితే నాగచంద్రుడు భార్యను ఇంటికి రావాలని పిలుస్తూ వచ్చాడు. అయినా రాకపోవడంతో మనస్తాపానికి గురైన అతను బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక, రామేశ్వరం బైపా్‌సలోని ఓ తోటలోకి వెళ్లి అక్కడ వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ నాగరాజు, ఎస్‌ఐ శివశంకర్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలను ఆరా తీసి తెలుసుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నట్లు సీఐ నరహరి నాగరాజు తెలిపారు.


Updated Date - 2021-06-18T05:05:52+05:30 IST