భార్య గొంతు కోసి పరారీ

ABN , First Publish Date - 2021-10-25T04:44:43+05:30 IST

కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భార్య గొంతు కోసి పరారీ
భర్త చేతిలో గాయపడ్డ భానుశ్రీ

సోమల, అక్టోబరు 24: కుటుంబ కలహాలతో భార్య గొంతుకోసి పరారైన భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలం చిన్నఉప్పరపల్లె పంచాయతీ మల్లెలవారిపల్లెకు చెందిన భానుశ్రీ (24)కి రెండు సంవత్సరాల క్రితం పూతలపట్టు మండలం దమ్మాలపల్లెకి చెందిన వెంకటాద్రితో వివాహమైంది. వీరికి 9 నెలల కుమారుడు ఉన్నాడు.  కొద్ది నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భానుశ్రీ పది రోజుల క్రితం పుట్టినింటికి వచ్చింది. ఈ నేపథ్యంలో అత్తగారింటికి వచ్చిన వెంకటాద్రి అనారోగ్యంతో ఉన్న భార్యను ఆస్పత్రికి తీసుకెళుతానని నమ్మించాడు. ద్విచక్ర వాహనంలో సోమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో అడుసుపల్లె ఎక్కల్లవారి మామిడి తోపు వద్దకు రాగానే భార్యపై చాకుతో దాడిచేశాడు. గొంతుకోశాడు. ఆమె కేకలు విని సమీప రైతుల రావడంతో పారిపోయాడు. రైతులు 108 వాహనంలో ఆమెను సోమల వైద్యశాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. 

Updated Date - 2021-10-25T04:44:43+05:30 IST