ఏడాదిన్నర క్రితం పెళ్లి.. పిల్లలు పుట్టడం లేదని రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత భర్త చేసిన పనికి భార్య షాక్

ABN , First Publish Date - 2021-12-26T23:07:11+05:30 IST

అతడికి ఏడాదిన్నర క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అతడు ఆమెను ప్రేమగా చూసుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్ర

ఏడాదిన్నర క్రితం పెళ్లి.. పిల్లలు పుట్టడం లేదని రాత్రి వేళ అందరూ పడుకున్న తర్వాత భర్త చేసిన పనికి భార్య షాక్

ఇంటర్నెట్ డెస్క్: అతడికి ఏడాదిన్నర క్రితం ఓ యువతితో వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో అతడు ఆమెను ప్రేమగా చూసుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో.. డ్రగ్స్‌కు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఓ రోజు రాత్రి దారుణానికి పాల్పడ్డాడు. ఇంతకూ ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని పాలీ ప్రాంతానికి చెందిన 27ఏళ్ల శ్రవణ్ అనే యువకుడికి 22ఏళ్ల కాంచనతో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. పెళ్లైన మొదట్లో కాంచనను శ్రవణ్ ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. అయితే పెళ్లై నెలలు గడుస్తున్నా.. భార్య గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో ఆమెపై ఉన్న ప్రేమ కాస్తా ద్వేషంగా మారింది. దీంతో శ్రవణ్.. మత్తపదార్థాలకు బానిసయ్యాడు. రోజూ మత్తుపదార్థాలను తీసుకుని, భార్యతో గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి కూడా భార్యతో గొడవపడ్డాడు. అందరూ పడుకున్న తర్వాత తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే భర్త విగత జీవిగా గదిలో వేలాడుతుండటం చూసి షాకైంది. కాగా.. విషయం తెలిసి అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం పోలీసులకు తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 




Updated Date - 2021-12-26T23:07:11+05:30 IST