ఒక అమ్మాయి.. రెండు పెళ్లిళ్లు.. వీళ్ల కథతో ఏకంగా సినిమాయే తీయొచ్చు.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-12-14T18:09:27+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక విచిత్ర ఉదంతం..

ఒక అమ్మాయి.. రెండు పెళ్లిళ్లు.. వీళ్ల కథతో ఏకంగా సినిమాయే తీయొచ్చు.. అసలు కథేంటంటే..

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఆలయంలో వధూవరుల నడుమ వివాహ తంతు జరుగుతున్న సమయంలో.. ఆలయం వెలుపల ఏదో గొడవ ప్రారంభమయ్యింది. అక్కడున్న కొంతమంది వధువు తమ ఇంటి కోడలని, తమకు వదిన అంటూ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ నేపధ్యంలో పరస్పరం దాడులు చోటుచేసుకున్నాయి. ఇలా గొడవ సాగుతుండగానే. దీనికి ఏమాత్రం సంబంధం లేనట్లు పెళ్లి తంతు యధావిధిగా జరిగిపోయింది. తరువాత వధువు.. వరునితో పాటు అత్తారింటికి వెళ్లిపోయింది. 


వివరాల్లోకి వెళితే యూపీలోని ఝాన్సీ జిల్లాలోని డోంగరీ గ్రామానికి చెందిన అఖిలేష్ పరిహార్‌కు గ్రామానికి చెందిన ఒక బాలికతో అఫైర్ ఉంది. ఏడాది క్రితం ఆ బాలికతో పాటు వేరే ప్రాంతానికి వెళ్లిపోయి వివాహం కూడా చేసుకున్నాడు. ఆ బాలిక కుటుంబ సభ్యులు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిద్దరినీ గ్రామానికి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆ బాలికను అపహరించుకుని తీసుకువెళ్లిన నేరానికి అఖిలేష్‌ను జైలుకు తరలించారు. 8 నెలల నుంచి అఖిలేష్ జైలులో ఉంటున్నాడు. ఈ సమయంలో ఆ బాలిక కుటుంబ సభ్యులు వేరొకరితో ఆమెకు వివాహం నిశ్చయించారు. ఈ మేరకు ఆలయంలో రహస్యంగా వివాహం జరిపిస్తున్నారు. విషయం తెలుసుకున్న అఖిలేష్ కుటుంబ సభ్యులు వివాహం జరుగుతున్న ఆలయానికి చేరుకుని, కల్యాణ మండపంలో ఉన్న వధువు తమ ఇంటి కోడలు అని చెబుతూ, పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో గందరగోళం నెలకొంది. అఖిలేష్ సోదరులు వధువు బందువులపై దాడి చేశారు. ఇదిలా సాగుతుండగానే వివాహ తంతు ముగిసింది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2021-12-14T18:09:27+05:30 IST