HYD : ఒంటికి నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష
ABN , First Publish Date - 2022-01-04T13:35:00+05:30 IST
ఒంటికి నిప్పంటించుకొని భార్య ఆత్మహత్య.. భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష
హైదరాబాద్ సిటీ/చాంద్రాయణగుట్ట : భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న కేసులో భర్తకు తొమ్మిదేళ్ల జైలు శిక్ష పడింది. ఫలక్నుమా గుల్షన్ మాస్క్కు చెందిన సయ్య ద్ ఫయాజ్ (32), షాహీదా బేగం భార్యాభర్తలు. మద్యానికి బానిసై భర్త తరుచూ వేధించేవాడు. జీవితంపై విరక్తి చెందిన భార్య షాహీదా బేగం 2013లో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు భర్తపై 498ఎ, 306 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి.శైలజా వాదనలు వినిపించడంతో 7 అడిషనల్ మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి డి.శ్రీనివాస్ సయ్యద్ ఫయాజ్కు 9 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించిందని ఫలక్నుమా ఇన్స్పెక్టర్ ఆర్.దేవేందర్ తెలిపారు.