హైదరాబాద్ : భార్యను దారుణంగా హత్య చేసిన భర్త
ABN , First Publish Date - 2021-06-03T13:53:04+05:30 IST
ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్
హైదరాబాద్/జీడిమెట్ల : ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని గాజులరామారం ప్రాంతంలో జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట్ మండలం మరికల్ గ్రామానికి చెందిన కేతావత్ రాజు, సువర్ణ(30)లు భార్యాభర్తలు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి గాజులరామారం ప్రాంతంలోని బతుకమ్మబండలో నివాసముంటున్నారు. వీరిద్దరు టైల్స్ కూలీలుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య పనిచేసే చోట ఓ వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి గొడవపడి భార్యను కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలై ఆమె మృతిచెందింది. బస్తీ పెద్దలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.