ఆషాఢమాసంలో భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆ భర్త ఎలాంటి పనిచేశాడో తెలిస్తే.. !

ABN , First Publish Date - 2021-07-23T16:52:29+05:30 IST

అతను ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోంది..

ఆషాఢమాసంలో భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఆ భర్త ఎలాంటి పనిచేశాడో తెలిస్తే.. !

అతను ఏడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతోంది.. ఇంతలో ఆషాఢమాసం రావడంతో భార్య తన పుట్టింటికి వెళ్లింది.. ఆషాఢ మాసం పూర్తి కావడానికి ముందే భార్యను పంపమంటే ఆమె కుటుంబ సభ్యులు తిరస్కరించారు.. దీంతో మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. తమిళనాడులోని జోలార్‌పేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. 


జోలార్‌పేట తామలేరి ముత్తూర్‌కు చెందిన దిలీపన్‌(33) తిరుపత్తూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్నాడు‌. దిలీపన్ అదే ప్రాంతానికి చెందిన డాక్టర్ దివ్యను ఏడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహం తర్వాత తొలి ఆడి నెల (ఆషాఢమాసం) కావడంతో దివ్య గత నెల 15న పుట్టింటికి వెళ్లింది. తిరిగి దివ్యను పంపించాలని దిలీపన్ ఆమె కుటుంబ సభ్యులను అడిగాడు. నెల పూర్తి కాకుండా పంపబోమని దివ్య కుటుంబ సభ్యులు చెప్పారు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. దీంతో విరక్తి చెందిన దిలీపన్ తన ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న జోలార్‌పేట పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-07-23T16:52:29+05:30 IST