భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టిన భర్త
ABN , First Publish Date - 2020-10-12T20:39:22+05:30 IST
హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి భర్త వెంకన్న తగలబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
హైదరాబాద్: సరూర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై పెట్రోల్ పోసి భర్త వెంకన్న తగలబెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. వెంకన్న ఉద్యోగం చేయటం లేదని భార్య నిలదీయడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.