భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకున్న భర్త

ABN , First Publish Date - 2021-05-17T05:05:13+05:30 IST

మండలంలోని కుప్రియాల్‌ గ్రామానికి చెందిన చేగ బాబయ్య(45) భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది కిరోసిన్‌తో నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నం చేశాడు.

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకున్న భర్త

సదాశివనగర్‌, మే 16: మండలంలోని కుప్రియాల్‌ గ్రామానికి చెందిన చేగ బాబయ్య(45) భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపం చెంది కిరోసిన్‌తో నిప్పంటించుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. గ్రామస్థులు తెలి పిన ప్రకారం.. భార్య భర్తల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగు తున్నాయి. దింతో భార్య తల్లిగారి ఇంటికి వెళ్లి కాపురానికి రావడం లేదు.   బాబయ్య తీవ్ర మనస్థాపం చెంది కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు మంటలను ఆర్పి బాబయ్యను వెంటనే కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో నిజామాబాద్‌ ఆసుప త్రికి రెఫర్‌ చేసినట్లు స్థానికులు తెలిపారు

Updated Date - 2021-05-17T05:05:13+05:30 IST