భర్త రెండో పెళ్లిని భార్య, పిల్లలు అడ్డుకోగానే...
ABN , First Publish Date - 2020-06-05T13:55:03+05:30 IST
భర్త రెండవ వివాహాన్ని భార్య అడ్డుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వేలూరు సమీపంలోని
చెన్నై: భర్త రెండవ వివాహాన్ని భార్య అడ్డుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురిపై కేసు నమోదు చేశారు. వేలూరు సమీపంలోని మేట్టుఇడయన్పేటకు చెందిన టైలర్ రామచంద్రన్(45)కు కమలి (40)తో 20 ఏళ్ల క్రితం వివాహం కాగా వారికి ఇద్దరు కుమారులున్నారు. భర్త పలువురు మహిళలతో సంబంధం పెట్టుకోవడాన్ని సహించలేని కమలి రెండేళ్ల క్రితం భర్తను విడిచి బాగాయంలో ఉన్న తల్లి ఇంట్లో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో రామచంద్రన్ గురువారం ఉదయం ఓసూరు అమ్మన్ ఆలయంలో ఫాతిమా అనే మహిళను వివాహం చేసుకుంటున్నట్టు కమలికి తెలిసింది. కుమారులతో అక్కడకు వెళ్లిన కమలినితో పాటు పోలీసులను గమనించిన రామచంద్రన్ గుండె నొప్పిగా వుందంటూ స్పృహతప్పి పడిపోవడంతో అతనిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.