సిగరెట్‌ వద్దన్న భార్య.. యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-04-10T15:09:03+05:30 IST

సిగరెట్‌ వ్యసనాన్ని మానుకోవాలంటూ భార్య మందలిండంతో యాసిడ్‌ తాగి

సిగరెట్‌ వద్దన్న భార్య.. యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్య

చెన్నై : సిగరెట్‌ వ్యసనాన్ని మానుకోవాలంటూ భార్య మందలిండంతో యాసిడ్‌ తాగి భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాలిగ్రామం మదియళగన్‌కు చెందిన నరసింహన్‌ (72) ప్రభుత్వ బస్‌ డ్రైవర్‌గా పదవీ విరమణ పొందారు. కొన్నేళ్లుగా నరసింహన్‌కు ధూమపాన వ్యసనం ఉంది. ఈ విషయమై భార్యాభర్తలిద్దరి మధ్య గొడవలు జరిగేవి.


ఈ క్రమంలో బుధవారం రాత్రి ఈ విషయమై దంపతుల మధ్య మళ్లీ వివాదం రేగింది. మనస్తాపం చెందిన నరసింహన్‌ టాయ్‌లెట్‌లోని యాసిడ్‌ తాగి స్పృహ తప్పి పడిపోయాడు. చుట్టుపక్కల వారు అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స ఫలించక మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2020-04-10T15:09:03+05:30 IST