TikTok మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-07-11T23:41:03+05:30 IST

TikTok మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

TikTok మోజులో భార్య.. భర్త ఆత్మహత్య

హైదరాబాద్: ప్రస్తుత ప్రపంచంలో ఆన్‌లైన్, సోషల్ మీడియా లేని క్షణాన్ని ఊహించుకోలేము. మానవాళి జీవన విధానంలో ఇవి భాగమయ్యాయి. ఎంతలా అంటే మనుషుల నుంచి మనుషులను విడదీసేంత వరకు వీటి ప్రభావం వెల్లిందనే విమర్శలు ఉన్నాయి. కొన్ని సంఘటనలు ఇది వాస్తవమేనని రుజువు చేస్తున్నాయి. తాజాగా టిక్‌టాక్ మోజులో పడిన ఓ భార్య వల్ల భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని సనత్‌నగర్ సమీపంలోని ఫతేనగర్‌లో ఆదివారం జరిగిందీ సంఘటన.


పవన్ నీమ్కార్, ప్రియాంక నీమ్కార్ అనే వ్యక్తులకు ఆరేళ్ల క్రితం పెళ్లైంది. కొంతకాలం వరకు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాకు ప్రియాంక అలవాటు పడిపోయింది. ఇది రాను రాను ఎక్కువైంది. రాత్రికిరాత్రే టిక్‌టాక్‌లో వీడియోలు చేస్తూ వచ్చింది. టిక్‌టాక్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవుతున్నా కొద్ది ప్రియాంక మొత్తంగా సోషల్ మీడియాకే పరిమితమైపో సాగింది. ఇది గమనించిన భర్త పవన్.. ఆమెను పలు మార్లు మందలించాడు. వీరిద్దరూ కొన్నిసార్లు ఘర్షణ కూడా పడ్డారని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రియాంక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసుగు చెందిన భర్త పవన్.. ఆదివారం ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.


తన కుమారుడు పవన్ మృతికి కోడలు ప్రియాంకనే కారణమని పవన్ తల్లి బాలానగర్ డీసీపీ పద్మజకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై లిఖిత పూర్వక ఫిర్యాదు పోలీసు స్టేషన్‌లో సమర్పించారు.



Updated Date - 2021-07-11T23:41:03+05:30 IST