వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య

ABN , First Publish Date - 2021-06-18T06:19:47+05:30 IST

భర్త వేధింపులతో కూ ల్‌డ్రింక్‌లో ఎలుకల మందు ఇచ్చి భార్య హతమా ర్చింది. ఈ ఘటన గురువారం మండలంలోని తూర్పు కొప్పెరపాడులో వెలుగు చూసింది.

వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య
రవి మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ సుబ్బారావు

తూర్పుకొప్పెరపాడులో ఘటన


పంగులూరు, జూన్‌ 17: భర్త వేధింపులతో కూ ల్‌డ్రింక్‌లో ఎలుకల మందు ఇచ్చి భార్య హతమా ర్చింది. ఈ ఘటన గురువారం మండలంలోని తూర్పు కొప్పెరపాడులో వెలుగు చూసింది. పోలీ సుల సమాచారం మేరకు.. మండలంలోని తూ ర్పుకొప్పెరపాడు గ్రామ వడ్డెర కాలనీకి చెందిన కుంచాల రవి (35), రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. వీరి కి ధనుష్‌(6), అశోక్‌ (3)పిల్లలున్నారు. రవి మ ద్యానికి బానిసయ్యాడు. ఈక్రమంలో భర్తను అ డ్డు తొలగించుకోవాలనుకుంది. ఇందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న  రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి పూటుగా మద్యం తాగిన వచ్చిన  భర్తకు ఎలుక ల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగించింది. దీం తో రవి అదే రాత్రి చనిపోయాడు. భర్త మరణా న్ని తాగుడు కారణంగా గొంతెండి మరణించాడని  నమ్మించే ప్రయత్నం చేసింది. ముందుగా మా ర్టూరు మండలం రాజుపాలెం గ్రామంలో కూతు రు వద్ద ఉంటున్న రవి తల్లి రామాంజమ్మకు, బంధువర్గానికి విషయాన్ని తెలిపింది. రాజ్యలక్ష్మి మాటలు నమ్మిన తల్లి, ఆడబిడ్డతో పాటు బంధు వులు కొప్పెరపాడు గ్రామం చేరుకుని గురువారం అంత్యక్రియలు చేసే ప్రయత్నంలో హతుడి మెడ వరుసుకుని ఉండటాన్ని గమనించి  అనుమానం తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఇంకొల్లు సీఐ పి.సుబ్బారావు, ఎస్‌ఐ శ్రీనివాసరావు జియోలతో కలసి  పూర్వాపరాలను పరిశీలించి విచారణ చేపట్టారు. రాజ్యలక్ష్మి భర్త వేధింపులకు తాళలేక హతమార్చినట్లు అంగీకరిం చింది. హతుని తల్లి రామాంజమ్మ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇంకొల్లు సీఐ సుబ్బారావు కేసు ద ర్యాప్తు చేస్తున్నారు.      


Updated Date - 2021-06-18T06:19:47+05:30 IST