Telangana: గన్ మిస్ఫైర్ ఘటనపై హుస్నాబాద్ ఏసీపీ స్పందన
ABN , First Publish Date - 2021-11-04T17:26:44+05:30 IST
జిల్లాలోని మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో జరిగి గన్ మిస్ఫైర్ ఘనంపై హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ స్పందించారు.
సిద్దిపేట: జిల్లాలోని మద్దూరు మండలం సలాక్పూర్ గ్రామంలో జరిగి గన్ మిస్ఫైర్ ఘనంపై హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీష్ స్పందించారు. గ్రామంలో సయ్యద్ మన్సూర్కు చెందిన ఇంట్లో ప్రమాదవ శాత్తూ ఎయిర్ గన్ పేలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. సయ్యద్ మన్సూర్ వృత్తి రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. వారాంతపు సెలవుకు హైదరాబాద్ నుండి సలాక్ పూర్కు సయ్యద్ మన్సూర్ అతనితో పాటు ఏడుగురు స్నేహితులు వచ్చారు. రాత్రి విందు చేసుకొనే క్రమంలో షికారుకు చెందిన ఎయిర్ గన్ మిస్ ఫైర్ అయి ముసాఫ్ ఖాన్ తలకు బలంగా తగలడంతో మృతి చెందాడని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని ఏసీపీ సతీష్ తెలిపారు.