నిండు కుండలా హుస్సేన్సాగర్
ABN , First Publish Date - 2020-08-15T23:38:49+05:30 IST
వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు, ప్రస్తుతం 513.58 మీటర్లు వరకు నీరు ఉంది.
హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు హుస్సేన్సాగర్ నిండుకుండలా మారింది. హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్ లెవెల్ 513.41 మీటర్లు, ప్రస్తుతం 513.58 మీటర్లు వరకు నీరు ఉంది. తూము ద్వారా జీహెచ్ఎంసీ లేక్స్ అధికారులు నీటిని వదులుతున్నారు. హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా 240 చదరపు కిలోమీటర్ల మేర వర్షం కురుస్తోంది. దీంతో సాగర్లోకి వరద వచ్చి చేరుతోంది. 7 వందల క్యూసెక్కులకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో చేరింది. అయితే హైదరాబాద్ నగరంలో వర్షం సాధారణంగా కురుస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవని బల్దియా వర్గాలు చెబుతున్నాయి.