విద్యుదాఘాతం కారణంగా పూరి గుడిసె దగ్ధం
ABN , First Publish Date - 2020-03-30T13:48:46+05:30 IST
వరంగల్ రూరల్: విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది.
వరంగల్ రూరల్: విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగి ఓ గుడిసె పూర్తిగా దగ్ధమైన ఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. మహ్మద్ అంకుస్ అనే వ్యక్తికి చెందిన పూరి గుడిసెలో విద్యుదాఘాతం కారణంగా మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల ఉన్న జనం, సర్పంచ్ గ్రామ పంచాయతీ సిబ్బంది పెద్ద ఎత్తున బిందెలతో, ట్యాంకర్తో నీళ్లు పోసి మంటలు అదుపు చేశారు. కానీ అప్పటికే పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది.