హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల

ABN , First Publish Date - 2021-10-03T19:40:47+05:30 IST

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్

హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల

హుజురాబాద్: హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ను బీజేపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీఆర్ఎస్‌లో జరిగిన పరిణామాలతో ఆయన కారు పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీ‌లో చేరారు. దీంతో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్‌ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ పోటీలో తలపడుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ నర్సింగరావు(వెంకట్‌) పేరును ఏఐసీసీ ప్రకటించింది. దీంతో ఈ ఎన్నికలో పోటీ పడే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరన్నది తేలిపోయింది. హుజురాబాద్ ఉప‌ఎన్నికకు  అక్టోబర్ 1న ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి. అక్టోబర్ 8న అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. 13న ఉపసంహరించుకోనున్నారు. 

Updated Date - 2021-10-03T19:40:47+05:30 IST