ముగిసిన Huzurabad ఉప ఎన్నిక
ABN , First Publish Date - 2021-10-30T16:10:31+05:30 IST
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ కొనసాగనుంది. ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల
హుజురాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఈ సాయంత్రం 7 గంటలకు పోలింగ్ కొనసాగింది. భారీగా పోలింగ్ శాతం నమోదు అయింది. ఉప ఎన్నిక పోరులో అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్ నర్సింగారావు, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇక విజయంపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి.
జమ్మికుంటలో టీఆర్ఎస్, బీజేపీ నేతల ఘర్షణ
రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నహుజూరాబాద్ ఉప ఎన్నిక కీలక ఘట్టానికి చేరుకుంది. కాగా జమ్మికుంట పట్టణంలో టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఘర్షణకు దిగారు. టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గల 176వ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికేతరుల ప్రచారాన్ని బీజేపీ నేతలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పోలింగ్ బూత్ల్లో గందరగోళం
పోలింగ్ బూత్ల్లో గందరగోళం ఏర్పడింది. బూతుల్లో 30 మందికి సరిపడా రెండు ఈవీఎంలు ఏర్పాటు చేశారు. అయితే.. మొదటి ఈవీఎం పెట్టాల్సిన స్థానంలో రెండవ ఈవీఎంను పెట్టారు. దీంతో బూత్ లో గందరగోళం నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన ఓట్లరు అయోమయానికి గురై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తం ఓటర్లు రెండు లక్షల 37 వేల మంది ఓటర్లు...
హుజురాబాద్లో మొత్తం ఓటర్లు రెండు లక్షల 37 వేల మంది ఉండగా 36 మంది ఉన్నారు. ఐదు మండలాల్లో 306 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికకు 421 కంట్రోల్ యూనిట్స్, 891 బ్యాలెట్ యూనిట్స్ అధికారులు సిద్ధం చేశారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత కోవిడ్ పేషంట్స్కి ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా, ఎన్నికలు జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు వెబ్కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కోసం జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.