Huzurabadలో ఉదయం 11 గంటల వరకు భారీ పోలింగ్

ABN , First Publish Date - 2021-10-30T16:45:42+05:30 IST

హుజురాబాద్ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Huzurabadలో ఉదయం 11 గంటల వరకు భారీ పోలింగ్

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.  ఉదయం 11 గంటల వరకు పోలింగ్ శాతం భారీగా నమోదు అయ్యింది. ఐదు మండలాల్లో 33.27 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు వేసుకుందుకు మహిళా ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. తొలి నాలుగు గంటలకే 33.27 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. పోలింగ్‌కు ఇంకా ఎనిమిది గంటల సమయం ఉంది. 


Updated Date - 2021-10-30T16:45:42+05:30 IST