మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చల్లుకోవాలి: అరవింద్
ABN , First Publish Date - 2021-08-21T19:27:45+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్పై హుజూరాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కరీంనగర్: ముఖ్యమంత్రి కేసీఆర్పై హుజూరాబాద్ ఎంపీ అరవింద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ లాంటి నరుకుడు పోశెట్టి ప్రపంచంలోనే లేడని అన్నారు. తెలంగాణలో అన్ని పథకాలూ అవినీతిమయమే అని ఆరోపించారు. తెలంగాణ క్యాబినెట్లో దళితులకు చోటు ఏది అని ప్రశ్నించారు. మోదీ కాళ్ళు కడిగి ఆ నీళ్లను కేసీఆర్ తల మీద చల్లుకోవాలని అన్నారు. తెలంగాణ సీఎం ఒక బెవకూఫ్.. యూజ్ లెస్ ఫెల్లో అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం లక్షా 70 వేల కోట్లు సంపాదించిందని తెలిపారు. 2023 లో విజయ్ మాల్య వెళ్లినట్టు కేటీఆర్, కవిత, సంతోష్, హరీశ్లు విదేశాలకు పారిపోతారని అన్నారు. కేసీఆర్కు రేవంత్ 2023 వరకు రెండో కొడుకు అని అన్నారు. గెలిచే కాడికి కొడుకుని, గెలవని కాడికి హరీష్ని పంపి బకరా చేస్తున్నారని దుయ్యబట్టారు. రోహింగ్యాలకి పాస్ పోర్ట్లు ఇవ్వడం అంటే టెర్రరిస్ట్లకు సహాయం చెయ్యడమే అని అన్నారు. కొంగ మెడ హరీష్ అబద్ధాలు చెప్పడానికి సిగ్గులేదా అని మండిపడ్డారు. సోమేష్ కుమార్ పెద్ద దొంగ అని.... కేంద్రానికి అన్ని అబద్ధాలు చెప్తున్నారని ఎంపీ అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.