ట్యాంకర్‌ ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-09-28T12:10:47+05:30 IST

ట్యాంకర్‌ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ వినాయకనగర్‌కాలనీ స్వాతి

ట్యాంకర్‌ ఢీకొని వృద్ధుడి మృతి

హయత్‌నగర్‌, సెప్టెంబర్‌ 27 (ఆంధ్రజ్యోతి): ట్యాంకర్‌ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్‌నగర్‌ వినాయకనగర్‌కాలనీ స్వాతి అపార్టుమెంటులో నివాసం ఉండే దిండి విజయ్‌కుమార్‌(68) ఆదివారం ఉదయం బైకుపై వస్తుండగా హయత్‌నగర్‌ బజాజ్‌ ఎలక్ర్టానిక్‌ వద్ద హైదరాబాద్‌ వైపు నుంచి వేగంగా వస్తున్న ట్యాంకర్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్‌కుమార్‌ అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-28T12:10:47+05:30 IST