తీగల వంతెనపై తేనెలూరే సంగీతం
ABN , First Publish Date - 2020-09-28T12:20:13+05:30 IST
దేశభక్తి, అమరుల త్యాగాలను స్మరిస్తూ సంగీతం, పాటలతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ఓ వైపు విద్యుత్ వెలుగులు విరజిల్లుతుండగా, ఆహ్లాదకరమైన పాటలు సందర్శకుల మనస్సును హత్తుకున్నాయి.
ఆకట్టుకున్న ఆర్మీ సింపోని బ్యాండ్ కచేరీ
మాదాపూర్, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): దేశభక్తి, అమరుల త్యాగాలను స్మరిస్తూ సంగీతం, పాటలతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ఓ వైపు విద్యుత్ వెలుగులు విరజిల్లుతుండగా, ఆహ్లాదకరమైన పాటలు సందర్శకుల మనస్సును హత్తుకున్నాయి. మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ వంతెన వద్దకు ఆదివారం రాత్రి భారీగా జనం వచ్చారు. జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండియన్ ఆర్మీ సింపోని బ్యాండ్, అనీష బృందం కచేరి అందరినీ కట్టిపడేసింది.
దేశసరిహద్దుల్లో అమరవీరుల త్యాగాలు, కరోనా సమయంలో ముందు వరుసలో నిలిచిన వారికి సంఘీభావంగా ఈ కార్యక్రమాన్ని ఏర్టాపు చేశారు. ఇండియన్ ఆర్మీ సింపోని బ్యాండ్ బృందంలో 40 మంది సభ్యులు సుమారు రెండు గంటల పాటు కచేరీ నిర్వహించారు. మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజర్ జనరల్ ఆర్కే సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.