హైదరాబాద్‌లో దారుణ హత్య

ABN , First Publish Date - 2021-05-11T15:21:09+05:30 IST

హైదరాబాద్: జీడిమెట్ల పరిధి చింతల్ భగత్ సింగ్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది.

హైదరాబాద్‌లో దారుణ హత్య

హైదరాబాద్: జీడిమెట్ల పరిధి చింతల్ భగత్ సింగ్‌నగర్‌లో దారుణ హత్య జరిగింది. ఇంట్లో ఉన్న సువర్ణ (48) అనే మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మెడలో పుస్తెలతాడుతో సహా ఇంట్లో ఉన్న ఆభరణాలు ఎత్తుకుపోయారు. సుమారు రూ. 5 లక్షల విలువగల ఆభరణాలు చోరీ అయినట్లు గుర్తించారు. నిన్న ఉదయం విధులకు వెళ్లిన సువర్ణ భర్త రాత్రి ఇంటికి వచ్చి చూసేసరికి భార్య మెడకు టవల్ చుట్టి నోట్లో నుండి రక్త స్రావంతో మృతి చెందింది. బీరువా తెరిచి ఉండడం గమనించి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2021-05-11T15:21:09+05:30 IST