ముగ్గురు సీపీలను అభినందించిన తెలంగాణ హైకోర్టు
ABN , First Publish Date - 2021-05-17T17:21:57+05:30 IST
కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు అభినందించింది.
హైదరాబాద్: కరోనా తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విధించిన లాక్డౌన్ సమయంలో నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తున్న ముగ్గురు కమిషనర్లను తెలంగాణ హైకోర్టు అభినందించింది. సోమవారం ఉదయం కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ మొదలైంది. ఈ సందర్భంగా లాక్డౌన్ సమయంలో, రిలాక్సేషన్ సమయంలో వీడియో గ్రఫీ తీసిన ఫుటేజ్ను ముగ్గురు హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు హైకోర్టుకు సమర్పించారు. లాక్డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 వరకు గైడ్ లైన్స్ను పటిష్టంగా అమలు చేసినందుకు ముగ్గురు సీపీలకు హైకోర్టు అభినందనలు తెలిపింది.