హైదరాబాద్: బంజారాహిల్స్‌లో బయటపడ్డ రూ. 12 కోట్ల భూ కబ్జా

ABN , First Publish Date - 2021-06-17T22:06:51+05:30 IST

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ.12 కోట్లు విలువచేసే భూమి కబ్జాకు గురైంది.

హైదరాబాద్: బంజారాహిల్స్‌లో బయటపడ్డ రూ. 12 కోట్ల భూ కబ్జా

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 10లో రూ. 12 కోట్లు విలువచేసే 6 వందల గజాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైన విషయం బయటపడింది. అసదుల్లా పాషా అనే బిల్డర్ షేక్‌పేట్ తహసీల్దార్ సంతకం పోర్జరీ చేసి భూ కబ్జాకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు బిల్డర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ప్రభుత్వ భూమి అని బోర్టు పెట్టినప్పటికీ.. ఆ బోర్డును తొలగించి బిల్డర్ కబ్జా చేశాడు. 

Updated Date - 2021-06-17T22:06:51+05:30 IST