హైదరాబాద్: రాజీ కోసం పిలిచి రాడ్లు, కత్తులతో దాడి

ABN , First Publish Date - 2021-01-27T14:10:21+05:30 IST

సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. ఓ చిన్న వివాదంలో రాజీకి పిలిచి మరీ ఇద్దరు వ్యక్తులను రాడ్‌లతో చితకబాది, కత్తిపోట్లకు గురిచేశారు.

హైదరాబాద్: రాజీ కోసం పిలిచి రాడ్లు, కత్తులతో దాడి

హైదరాబాద్: సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి ఘర్షణ చెలరేగింది. ఓ చిన్న వివాదంలో రాజీకి పిలిచి మరీ ఇద్దరు వ్యక్తులను రాడ్‌లతో చితకబాది, కత్తిపోట్లకు గురిచేశారు. సింగరేణి కాలనీ గుడిసెల విషయంలో జరిగిన ఓ చిన్న వివాదంపై రాజీ కుదుర్చుకుందామంటూ నవీన్, శ్రీకాంత్‌లను ఉదయ్ కిరణ్, అతని అనుచరులు అర్ధరాత్రి సమయంలో పిలిపించారు. అయితే మాట్లాడుకుందామని పిలిచి నవీన్, శ్రీకాంత్‌లపై ఉదయ్ కిరణ్, అతని అనుచరులు దాడి చేశారు.  రాడ్లతో కొట్టి,కత్తితో కడుపులో పొడిచారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ నవీన్‌, శ్రీకాంత్‌లను ఆసుపత్రికి తరలించారు. నిందితుడు ఉదయ్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-01-27T14:10:21+05:30 IST