వేతన సంఘం సిఫార్సులివే...
ABN , First Publish Date - 2021-01-27T17:14:20+05:30 IST
ఉద్యోగి కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి వేతన సంఘం సిఫార్సు చేసింది.
హైదరాబాద్: ఉద్యోగి కనీస వేతనం రూ.19 వేలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి వేతన సంఘం సిఫార్సు చేసింది. మూల వేతనంపై 7.5% ఫిట్మెంట్ ఇవ్వాలని పీఆర్సీ తన నివేదికలో పొందుపర్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60ఏళ్లకు పెంచాలని సూచించింది. హెచ్ఆర్ఏ తగ్గిస్తూ సిఫార్సు చేసిన వేతన సవరణ సంఘం, గ్రాట్యూటీ పరిమితి రూ.12లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచాలని తెలిపింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలుకు కమిషన్ సిఫార్సు చేసింది.