దుండిగల్ హత్య కేసును చేధించిన పోలీసులు

ABN , First Publish Date - 2021-01-27T18:00:11+05:30 IST

నగరంలోని దుండిగల్‌లో జరిగిన గండి మైసమ్మ వాచ్‌మ్యాన్ శివ గౌడ్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు.

దుండిగల్ హత్య కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్: నగరంలోని దుండిగల్‌లో జరిగిన గండి మైసమ్మ వాచ్‌మ్యాన్ శివ గౌడ్ హత్య కేసును పోలీసులు మూడు రోజుల్లోనే చేధించారు. ఈ నెల‌ 24 శివగౌడ్‌ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు సంబంధించి ముగ్గురు నిందుతులను దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పేకాటలో జరిగిన గొడవల్లో శివగౌడ్ హత్య జరిగింది. మృతుని కాల్‌డేటా ఆధారంగా పోలీసులు కేసును చేధించారు.  నిందితులు దిలీప్ సింగ్, బొంత దేవేందర్, బంటీ అనే ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి ఒక‌ స్కూటీ, రూ.13,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2021-01-27T18:00:11+05:30 IST