Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన ఆటో..భర్త మృతి, భార్యకు గాయాలు

ABN , First Publish Date - 2021-10-13T15:14:53+05:30 IST

డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. బాలానగర్‌ రాజు కాలనీకి చెందిన డి. సురేష్‌(38), స్వప్న భార్యాభర్తలు. సోమవారం ఉదయం సికింద్రాబాద్‌

Hyderabad: డీసీఎంను ఢీకొట్టిన ఆటో..భర్త మృతి, భార్యకు గాయాలు

హైదరాబాద్/అమీర్‌పేట: డీసీఎంను ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. బాలానగర్‌ రాజు కాలనీకి చెందిన డి. సురేష్‌(38), స్వప్న భార్యాభర్తలు. సోమవారం ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బాలానగర్‌కు ఆటోలో బయలుదేరారు. బల్కంపేట రైల్వే బ్రిడ్జి కింద మలుపులో డీసీఎం డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వస్తున్న ఆటో డీసీఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ఆటోలో ఉన్న స్వప్న, సురేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సురేష్‌ అదేరోజు రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు రాజేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-13T15:14:53+05:30 IST