ఆంధ్రా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

ABN , First Publish Date - 2020-12-05T17:27:51+05:30 IST

ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న వివాహితుడి గుట్టును రట్టయ్యింది. ముఖ్యంగా ఆంధ్రా అమ్మాయిలు, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే టార్గెట్‌గా ప్రేమాయణం సాగించేవాడు.

ఆంధ్రా అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న భర్త.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

హైదరాబాద్: ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తున్న వివాహితుడి గుట్టును రట్టయ్యింది. ముఖ్యంగా ఆంధ్రా అమ్మాయిలు, హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లే టార్గెట్‌గా ప్రేమాయణం సాగించేవాడు. ఇప్పటి వరకు ఆరుగురు యువతులను మోసం చేసి డబ్బులు దండుకున్నాడు. ఫేస్‌బుక్‌లో పరిచయం పెంచుకుని ఆపై ప్రేమ, పెళ్లితో లొంగదీసుకుంటున్న ప్రబుద్ధుడి వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకున్న భార్యను వదిలించుకోవడానికి వేధింపులకు పాల్పడటంతో ఆ దుర్మార్గుడి అసలు రంగు బయటపడింది.


వివరాల్లోకి వెళితే.. చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభాస్కర్‌పై భార్య సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో అతడిపై కేసు నమోదు అయ్యింది. సౌజన్యను 2017 జూన్‌లో వివాహం చేసుకున్న కుర్ర విజయభాస్కర్.. అనంతరం మేనకోడలిపై కన్నేశాడు. ఆ తర్వాత మరో ఇద్దరికి పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. ఇలా ఆరుగురు యువతులను మోసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ఇన్నిటిని భరిస్తున్నా... తనపై అత్తింటివారంతా కలిసి వేదింపులకు గురిచేశారని సౌజన్య వాపోయింది. నమ్ముకుని వస్తే జీవితాన్ని నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన దగ్గర నుంచి 25తులాల బంగారం, 15 లక్షల కట్నం తీసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు మూడేళ్ల బాబు ఉన్నాడని, ఎలాగైనా న్యాయం చేయాలని పోలీసులను కోరింది. 

Updated Date - 2020-12-05T17:27:51+05:30 IST