టీఎస్పీఎస్సీ వద్ద బీజేవైఎం ధర్నా...ఉద్రిక్తం
ABN , First Publish Date - 2021-03-02T18:03:13+05:30 IST
నగరంలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తంగా మారింది.
హైదరాబాద్: నగరంలోని టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మెరుపు ధర్నా ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని చెల్లించాలని యువ మోర్చా డిమాండ్ చేస్తోంది. బీజేపీ కార్యాలయం నుంచి టీఎస్పీఎస్సీ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరిన యువ మోర్చా సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో బీజేవైఎం కార్యకర్తలు వాగ్వివాదానికి దిగారు. వెంటనే వారిని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు.